అంత్యక్రియలకు ఆర్థిక సహకారం

Published: Friday November 25, 2022
సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 24 నవంబర్ ప్రజా పాలన : అనారోగ్యముతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పట్లూరు గ్రామానికి చెందిన బోయిని మల్లేశం మృతి చెందాడని సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ బోయిని మల్లేశం మృతి చెందిన సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే మృతుని ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చామని అన్నారు. అంత్యక్రియల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5 వేల రూపాయలు ఆర్థిక సహకారం అందించామని వివరించారు. ఇటీవల కాలంలో మృతుని అన్న వార్డు మెంబర్ బోయిని లాలయ్య మరణించారు. వారి కుటుంబంలో ఒకే సంవత్సరం ఇద్దరు అన్నదమ్ములు మరణించడంతో కాలనీ వాసులు కన్నీరు మున్నీరు అయ్యారు. మృతునికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. మృతుడు రైతు కావడంతో మృతునికి రైతు బీమా ఐదు లక్షలు మంజూరు చేయించి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకుంటుంది అని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ విషయం వ్యవసాయ అధికారి ఏఓ ప్రశాంత్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. రైతు బీమా త్వరగా అందేలా చూడాలని కోరారు.
పరామర్శించిన వారిలో తెరాస గ్రామ అధ్యక్షులు జి. అశోక్, తెరాస నాయకులు జె. రాచయ్య, గోపాల్ పెద్దోళ్ల మోహన్, రాజు, తలారి నర్సిములు, చాపల నాగేష్, మల్లయ్య తదితరులు ఉన్నారు.