లింగాయతులను ఓబీసీలో చేర్చాలి

Published: Saturday December 11, 2021
జాతీయ బీసీ కమిషన్  సభ్యులు ఆచారి కి వినతి పత్రం
వీరశైవ లింగాయత లింగ బలిజ సమన్వయ సమితి
హైదరాబాద్(ప్రజాపాలన ప్రతినిధి) : వీరశైవ లింగాయతులను ఓబీసీలో చేర్చాలని కోరుతూ వీరశైవ లింగాయత లింగ బలిజ సమన్వయ సమితి శుక్రవారం జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ని  కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సమితి గౌరవ అధ్యక్షులు సంగప్ప జేనవడే, అధ్యక్షులు అశోక్ ముస్తపురే, జనరల్ సెక్రటరీ  సోమేశ్వర్, ఉపాధ్యక్షులు మల్లికార్జున్ లు మాట్లాడుతూ.. వీరశైవ లింగాయతులను ఓ బీసీ లో చేర్చక పోవడం వల్ల విద్య, ఉద్యోగ, రిజర్వేషన్ల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. తమను ఓబీసీలో చేసిన ప్రభుత్వానికి తమ సామాజిక వర్గం రుణపడి ఉంటుందని తెలియజేశారు.