ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆంజనేయ స్వామికి పూజలు
Published: Wednesday April 28, 2021
బాలపూర్, ఏప్రిల్ 27, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ కాపాడాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంచాలని ఆంజనేయస్వామిని బీజేపీ నేతలు కోరారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నర్సింహ్మ ఆధ్వర్యంలో గుగ్గిళ్ళ గట్టు హనుమాన్ టెంపుల్ ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. బీజేపీ నేతలు అందరూ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బిజెపి నేతలు మాట్లాడుతూ... హనుమాన్ జయంతి సందర్భంగా స్వామిని వేడుకుంటూ కరోనా మహమ్మారి వైరస్ నుండి ప్రజలందరినీ కాపాడాలని సుఖ సంతోషాలతో యావత్ తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా కార్పొరేషన్ ప్రజలందరికీ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని దేవదేవుని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేషన్ అధ్యక్షులు పెండ్యాల నరసింహ్మ, ముతంగి కరుణానిధి, కోడూరు సోమేశ్వర్, కార్పొరేషన్ కార్పొరేటర్లు పసునూరి బిక్షపతి చారి, ఏ. అమర్నాథ్ రెడ్డి, కీసర హరినాథ్ రెడ్డి, నాగరాజు, శ్రావణ్ పాండు, భాస్కర్, వినేష్, భాజపా కార్యకర్తలు, నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: