మానవ సేవే మాధవసేవ

Published: Wednesday May 12, 2021
మైలవరపు వీరభద్రం, కనుమూరి  వెంకటేశ్వరావు
మధిర, మే 11, ప్రజాపాలన ప్రతినిధి : మధిర రోజు ఉదయం 7గంటలకుమధిర పట్నంలో ఆజాద్ రోడ్డు ప్రముఖ సామాజిక సేవకుడు లంకా కొండయ్య నివాస ప్రాంగణంలో కరోనా రూల్స్ పాటిస్తూ కరోనా కష్టకాలంలో ఆర్ధికంగా భాధపడుతున్న అభాగ్యులు దెందుకూరు గ్రామంలో షుగర్ వ్యాదితో రెండుకాళ్ళులేని వృద్ధ దంపతులుకూ అదే గ్రామంలో వితంతు మహిళకు సర్పంచ్ కోట విజయశాంతి గారి సూచనలు మేరకు, వారి ఆర్ధిక పరిస్థితి తెలియపరిచినారు మరియు సిరిపురం వికలాంగురాలు ఒక బేబీ కీ మధిర గోల్డ్ వ్యాపారి శ్రీ మైలవరపు వీరభద్రం కుమార్తె లక్ష్మి త్రిజూత (కన్యకా పరమేశ్వరి జ్యువలరీ) పుట్టినరోజు సందర్బంగా లంకా కొండయ్య సూచించిన నిరుపేద కుటుంబాలకు ప్రముఖ మధిర పట్నం trs పార్టీ భాద్యులు శ్రీ కనుమూరి వెంకటేశ్వరావుగారు, వీరభద్రం గార్ల చేతులు మీద ఒక్కక్కరికి ఒక నెలకు సరిపడా పచారీ సరుకులు అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరు ఉన్న వారు లేని వారికి సహాయం చేయాలనీ తెలియ పరిచినారు. ఈ కార్యక్రమంలో లంకా సేవా ఫౌండేషన్  వాలంటీర్లు కరుణ లియోనా, అధిములం వెంకటేశ్వర్లు శ్యామ్ కుమార్, అంజి తదితరులు పాల్గొన్నారు.