మున్సిపాలిటీ లో 15 నుండి జాతీయ బాలోత్సవ్

Published: Thursday November 03, 2022

మధిర నవంబర్ 2 (ప్రజా పాలన ప్రతినిధి) ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఈ నెల 15 మరియు 16 తేదీల్లో జాతీయస్థాయి బాలోత్సవ్ నిర్వహిస్తున్నట్లు బాలోత్సవ్ నిర్వాహకులు పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, బాబ్ల పేర్కొన్నారు. జాతీయ స్థాయి బాలోత్సవ్ కి సంబంధించిన గోడపత్రికలను మంగళవారం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామభక్త సీతయ్య కళాపరిషత్ ఏర్పడి పాతిక సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మధిరలో 15 మరియు 16 తేదీల్లో రెండు రోజులు పాటు సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా జాతీయ స్థాయి మధిర బాలోత్సవ్-2022 నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. నవంబర్ 15 వ తేదీన తొలి రోజు శాస్త్రీయ న్రృత్యాలు, జానపద నృత్యాలు, జానపద గ్రూపు డాన్సులు నిర్వహిస్తున్నట్లు వారి పేర్కొన్నారు. 16 వ తేదీన నీతి పద్యాలు, ఏకపాత్రాభినయం,నీసత్తాచాటుకో, విచిత్ర వేషధారణ  ఉంటాయన్నారు. జాతీయస్థాయి బాలోత్సవాల్లో పాల్గొనే చిన్నారులు కళాకారులు తమ ఎంట్రీ ఫారాలను ఈనెల 10వ తేదీలోగా 9440675787 సెల్ నెంబర్కు ఫోన్ చేసి అందజేయాలని వారు కోరారు.