కడియం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎర్రుపాలెం లో భారత్ బంద్

Published: Tuesday September 28, 2021
ఎరుపాలెం, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకిస్తూ అఖిల పక్షం ఇచ్చిన పిలుపు మేరకు ఎర్రుపాలెంలో కాంగ్రెస్ సొసైటీ చైర్మన్ కడియం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎర్రుపాలెంలో బంద్ ను నిర్వహించారు... ఈ సందర్భంగా మధిర నియెజకవర్గం యువజన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడేటి బాబూరావు, నండ్రు జనార్దన్, మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను విరమించి కోవాలని, జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించాలని, సిపియస్ ను రద్దు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు నెంబర్ గూడేటి మోహన్ రావు, నండ్రు రాజా, నండ్రు సురేష్, సీపీఎం నాయకులు సగ్గుర్తి సంగయ్య, కోటి సుబ్బారెడ్డి, బసవయ్య తదితరులు పాల్గొన్నారు...