ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్

Published: Friday November 04, 2022

జన్నారం, నవంబర్ 03, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రెడ్ రూరల్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జయరాణి ఉన్నత పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.  బుధవారం జన్నారం మండల జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ ఈ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు ఉచితంగా కంటి ఇతర పరీక్షలు నిర్వహించి, వ్యాధులకు ఉచితముగా వైద్యం పరీక్షలు చేసి, వైద్యులు మందులు అందించారన్నారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ఈ ఉచిత వైద్య శిభిరన్ని సద్వినియోగం చేసుకున్నారని వైద్యులు అన్నారు.  ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుతారి వినయ్ కుమార్, జన్నారం ఎంపీటీసీ మమ్మద్ రియాజుద్దీన్, పోన్కల్ సర్పంచ్ జక్కు భూమేష్, జన్నారం సర్పంచ్ భూషణవేని గంగాధర్ గౌడ్. ముత్యం భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.