విఆర్యేల సమ్మెకు బహుజన్ సమాజ్ పార్టీ సంఘీభావం

Published: Saturday July 30, 2022
ఇబ్రహీంపట్నం,జూలై 29 ( ప్రజాపాలన ప్రతినిధి ):
గత ఐదు రోజులుగా ఆర్డీవో కార్యాలయం ముందు, జాతీయ రహదారిపై నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న విఆర్యేలకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ , కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి గుజ్జరి ప్రకాష్, మాట్లాడుతూ  విఆర్యేల న్యాయబద్ద డిమాండ్లు అయినా పేస్కెలు ప్రకటించడం, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడం 50 ఏళ్ళు దాటిన వారందరి పిల్లలకు ఉద్యోగ బదిలీ చేయడం లాంటివి వెంటనే అమలు చేయాలని ప్రత్యేక రాష్ట్రం సాధించి కూడా విఆర్యేలకు ఎలాంటి సంతోషం లభించలేదని వాపోయారు ఈ కార్యక్రమంలో బహుజన సమాజ్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ గుజ్జరి ప్రకాష్,జిల్లా అధ్యక్షుడు లింబాద్రి,మండల ప్రెసిడెంట్ బొబ్బిలి కిషోర్, మరియు పెంట ప్రవీణ్, శశి,తాండ్ర అజయ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు