మండలంలో పదహారు కరోనా కేసులు నమోదు

Published: Tuesday January 25, 2022
మండల ప్రాథమిక ఆసుపత్రి డాక్టర్ వైద్యురాలు సునితా
జన్నారం రూరల్ జనవరి 24 ప్రజాపాలన:- మండల ప్రాథమిక ఆసుపత్రిలో పదహారు కరోనా కేసులు నమెాదయ్యాయాని జన్నారం ప్రాథమిక ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ సునితా తెలిపారు, సోమవారం మధ్యాహ్నం జన్నారం ప్రాథమిక ఆసుపత్రిలో యాబై మందికి కరోనా పరీక్షలు చేశామని అమె అన్నారు, వీరిలో పదహారు మందికి కరోనా పాజిటివ్ గా గుర్తించడం జరిగిందని అమె తెలిపారు, మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని అన్నారు, ఈ నేపథ్యంలో మండల ప్రజలు మాస్కులు దరించి భౌతిక దూరం పాటిస్తూ నిబందనాలు అనుసరించాలని అమె కోరారు, కాగా గడిచిన పది రోజులగా జన్నారం మండలంలో నమెాదైన కేసులు అరువై కరోనా పాజిటివ్ కేసులుగా పరిగనించామన్నారు.