సంకల్ప యాత్రను సక్సెస్ చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు బెల్లంపల్లి పట్టణ బిజెపి కమిటీ

Published: Tuesday July 05, 2022
బెల్లంపల్లి జూలై 4 ప్రజా పాలన ప్రతినిధి: ప్రధాని నరేంద్ర మోడీ  విజయ సంకల్ప యాత్రకు అనుకున్న దానికంటే ఎక్కువ మంది హాజరై విజయవంతం చేసినందుకు బెల్లంపల్లి పట్టణ భారతీయ జనతా పార్టీకమిటీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంకల్పయాత్ర కోసం గత నాలుగు రోజులుగా జిల్లాకు విచ్చేసిన ఇంచార్జ్ లను, ప్రతీ మండలానికి ప్రతి బూత్ స్థాయికి తీసుకోని వెళ్లి ,కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపారని, మిగతా పార్టీల నాయకుల వలె, నాయకులు కార్లలో వెళ్లి కార్యకర్తలను రైళ్లల్లో బస్సులలో రమ్మని చెప్పకుండా తమతోపాటే జిల్లా నాయకులు కూడా  రైల్లో ప్రయాణించి, లీడర్, క్యాడర్, అనే తారతమ్యత లేకుండా  ధైర్యాన్ని కల్పించి సంకల్పయాత్ర  అయ్యేంతవరకు ఉండి, ఎవరి గమ్య స్థానాలకు వారిని చేర్చినందుకు జిల్లా అధ్యక్షులు రఘునాథ్ కు, కార్యదర్శి మునిమంద రమేశులకు, బెల్లంపల్లి పట్టణ కమిటి వారికి కృతజ్ఞతలు తెలిపారు.
[7/4, 4:44 PM] Basker Bpl Reporter: కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న యువతులకు సర్టిఫికెట్లను ప్రధానం చేసిన 
 
అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్
 
బెల్లంపల్లి జూలై 4 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలం నీల్వాయి  రైతు వేదికలో గత మూడు నెలలుగా వయోజన విద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కుట్టు శిక్షణా కార్యక్రమం పూర్తయిన సందర్భంగా శిక్షణ పొందిన యువతులకు 60 మందికి మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ సోమవారం సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.
ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మాట్లాడుతూ
గత 90 రోజుల నుండి కుట్టు శిక్షణ కు ఆర్థికంగా సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ సాబీర్ అలీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ఆడిషల్ కలెక్టర్ డి, మధుసూదన్ నాయక్, వయోజన విద్య శాఖ జిల్లా ఇంచార్జి పురుషోత్తం , నీల్వాయి ఎంపీటీసీ ఆర్, సంతోష్ కుమార్ , సర్పంచ్ గాలి మధు, డి,అర్,పి లు సుందిళ్ళ రమేష్ , అశోక్ , మండల కోఆర్డినేటర్ లక్ష్మి, శిక్షకురాలు శైలజ, నిర్వాహకులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ సాబీర్ అలీ, శిక్షణ పొందిన  యువతులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.