*రాధయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న కూచిపూడి..*
Published: Saturday February 25, 2023
తల్లాడ, ఫిబ్రవరి 24 (ప్రజా పాలన న్యూస్):
కల్లూరు మండలంలోని చెన్నూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు గొర్రెపాటి రాధయ్య ప్రధమ వర్ధంతిని శుక్రవారం ఆ గ్రామంలో నిర్వహించారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు హాజరై ఆయన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కూచిపూడి మాట్లాడుతూ రాధయ్య పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారని గుర్తు చేశారు. ఆయన సేవలను స్పరిస్తూ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు తాళ్లూరి అప్పారావు, బానోతు చిట్టిబాబు, సరికొండ శ్రీనివాసరాజు, కొమ్మినేని నరసింహారావు, పోట్రు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: