16 న రవీంద్రభారతిలో గురు రవిదాస్ మహరాజ్ 645 వ జయంతి వేడుకలకు సర్వం సిద్ధం.

Published: Monday February 14, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి) : సమతామూర్తి, సంత్ శిరోమణి గురు రవి దాస్ మహరాజ్ 645వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈనెల 16న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు నిర్వహణ కమిటీ చైర్మన్ రాజమౌళి, కన్వీనర్ చీమ శ్రీనివాస్. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మానవులంతా సమానమే అని, ఎక్కువ కులం, తక్కువ కులం అంటూ ఉండవని, వ్యక్తిగత క్రమశిక్షణతో, భక్తితో ఎవరైనా ఏదైనా సాధించగలరని తన రచనలతో నాడే సామాజిక అభ్యున్నతికి పాటుపడిన గురు రవి దాస్ మహరాజ్ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో నిర్వహించ నున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రి కొప్పుల ఈశ్వర్, తెలంగాణ ప్లానింగ్ కమీషన్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎస్ సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ లతో పాటు పలువురు ఎం ఎల్ ఏ లు, ఎం ఎల్ సీలు పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. బహుజనులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.