సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేసిన తెరాస కార్యకర్తలు
బీరుపూర్, జనవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండల్ కొల్వాయి గ్రామంలో బీరుపూర్ మండల యువజన కమిటీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని మెరుగైన మౌలిక సదుపాయాలు నాణ్యమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే అకడమిక్ ఇయర్ ఒకటి నుండి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలిపారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దళితబందును నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేయాలని నిధులు కూడ మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల యూత్ అధ్యక్షుడు గాజర్ల రాంచందర్ గౌడ్ కొండపల్లి అజిత్ రావు మాజి సర్పంచ్ ముక్క శంకర్ జక్కినపల్లి శ్రీనివాసరావు రామకిస్టు గంగాధర్ చిక్రం మారుతి సతీష్ ఎదుల నర్సయ్య బౌతు రాజేష్ పర్వతం మహేందర్ వెయ్య సుధాకర్ దుంపేట సౌజన్ సర్ద ఏసు మ్యాదరవేని మల్లేష్ మేడి మురళి బేర అశోక్ చెట్ల రాజశేఖర్ పూడూరి మోగిలి తెరాస కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this on your social network: