కార్యాలయాలను దేవాలయాలుగా భావించాలి
Published: Thursday February 23, 2023
వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 ఫిబ్రవరి ప్రజాపాలన : కార్యాలయాలను దేవాలయాలుగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో గల జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని డిపిఓ తరుణ్ కుమార్ తో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు ప్రతిరోజు ఇంట్లో కంటే ఎక్కువ సమయం కార్యాలయాల్లో కేటాయించడం జరుగుతుందని, కార్యాలయాలను మన ఇంటి లాగా భావించి పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయ పరిసరాలలో, మరుగుదొడ్లలో చేపడుతున్న పరిశుభ్రతను పరిశీలించారు.
Share this on your social network: