ముద్దం ప్రకాష్ మరణం తీరని లోటు

Published: Monday May 31, 2021
మల్లాపూర్, మే 30 ప్రజాపాలన ప్రతినిధి : జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన సీనియర్ దళిత నాయకుడు, ఆల్ ఇండియా అంబేడ్కర్ సంఘం జాతీయ కార్యదర్శి, జిల్లా ఎస్సి ఎస్టీ అట్రాసిటి విజిలెన్స్ ఆండ్ మానిటరింగ్ మెంబర్ ముద్దం ప్రకాష్  ఇటీవల కరోనాతో మరణించడం యావత్ జిల్లాలోని దళిత సమాజానికి తీరని లోటు, తన సేవలను, త్యాగాలను గుర్తుచేసుకుంటూ మల్లాపూర్ మండలం కేంద్రంలోని బాబా సాహేబ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులు ఎర్ర రమేష్ మాట్లాడుతూ నిజంగా ప్రకాష్ మరణం యువతను కలచివేచిందని దళితులకు ఎక్కడ అన్యాయం జరిగిన స్పందించి న్యాయం జరిగేల పోరాడేవారని మరణంతో జిల్లా దళిత సమాజం ఒక పెద్ద దిక్కును కోల్పోయిందని రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్క కమలాకర్, జంగం దినేష్, పెద్దిరెడ్డి లక్ష్మన్, నిగ రవి, ఆకుతోట నర్సయ్య, మ్యాకల సతీష్, నల్ల లక్పతి, అరిగడ్డి సురేష్, ఆకుతోట భరత్, జాగర్ల లక్ష్మి నర్సయ్య, అంతడుపుల గంగరాజం తదితరులు పాల్గోన్నారు.