చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ సందర్శించిన ----ఆర్టీసీ ఈడీ పురుషోత్తం
Published: Thursday November 10, 2022
చౌటుప్పల్, నవంబర్ 9 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ ఆర్టీసీ బస్టాండ్ ని ఆర్టీసీ ఈడి పురుషోత్తం సందర్శించారు బస్టాండ్ లోని పరిసర ప్రాంతాలను టాయిలెట్స్ క్యాంటీన్ మరియు స్టాల్స్ ను సందర్శించారు ఆర్టీసీ ద్వారా నడిపిస్తున్న కార్గో పాయింట్స్ సిబ్బందికి బిజినెస్ పెంచుటకు తగిన సూచనలు చేశారు అన్ని మండలాల్లోని కార్గో ఏజెంట్లను పెంచి మారుమూల ప్రాంతాలకు కార్గో సేవలను విశృతపరచాలని చెప్పారు ప్రయాణం ప్రాంగణం చాలా శుభ్రతగా కలిగి ఉందని సిబ్బంది ప్రసంసించారు ప్రయాణికులకు అసౌకర్యం కలవకుండా మంచినీటి సౌకర్యాలను కల్పించుటకు తగిన సలహాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ కంట్రోలర్ బి రామచంద్రం, కార్గో పాయింట్ ఎంఏ రసూల్, పి యాదయ్య, శీను, తదితులు పాల్గొన్నారు,
Share this on your social network: