గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్వర్యంలో మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం

Published: Tuesday July 12, 2022
కోరుట్ల, జూలై 11 ( ప్రజాపాలన ప్రతినిధి ):
ఉపాధి నిమిత్తం కుటుంబ పోషణ కోసం, సౌదీ అరేబియా వెళ్ళిన జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి శ్రీనివాస్ అనే వ్యక్తి నాలుగు నెలల క్రితం సౌదీ అరేబియాలో ఉద్యమం ప్రాంతంలో ఆత్మహత్య చేసుకోవడంతో శ్రీనివాస్ మృత్య దేహాన్ని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అధ్వర్యంలో అతని స్వస్థలానికి చేర్చడం జరిగింది, గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక సౌది-దమ్మం సభ్యుల సహకారంతో సేకరించిన విరాళాలను 40,300/- రూపాయలను సోమవారం రోజున బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక అద్యక్షులు కృష్ణ దొనికేని, తెలంగాణ సౌదీ అద్యక్షులు బడుగు లక్ష్మణ్, ధమ్మం ఇంచార్జ్ లక్ష్మి నారాయణ గౌడ్, నిర్మల్ జిల్లా గౌరవ అద్యక్షులు వెంకటేష్ రపెల్లీ, మరియు సభ్యులు రాజేందర్ చిలువేరి, భీమెశ్ దోనికేని, ధారిషెట్టి గణేష్ పాల్గొన్నారు.
 
 
 
Attachments area
 
 
 
 
Reply
Forward