బావిలో దూకి మహిళ ఆత్మహత్య

Published: Wednesday June 09, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో గల బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం గ్రామ శివారులో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మంటిపల్లి మంగమ్మ(33) భర్త మల్లేష్ ఉదయం బావిలో దూకి ఆత్మహత్య చేసుకుందని తెలిపారు.ఆమె భర్త ఇటీవల కారు ప్రమాదంలో మరణించారు. వీరికి ముగ్గురు కుమారులు చిన్నపిల్లలు వున్నారు. ఎస్ఐ రాఘవేంద్ర గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.