నూతన మేనేజింగ్ కమిటీ నీ అభినందించిన ప్రభుత్వ విప్ గాంధీ

Published: Tuesday January 25, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన (జనవరి 24) : దాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ స్వామి అయ్యప్ప కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ కి నూతనంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గ సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగినది. గాంధీ మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీ కాలనీలో నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. అదేవిధంగా అయ్యప్ప సొసైటీ కాలనీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని,కాలనీ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి అని, ఏ చిన్న సమస్య ఐన తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని, నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గ సభ్యులు కాలనీ వాసులందరికి ఎల్లవేళాల అందుబాటులో ఉంటూ కాలనీ సమస్యల పై స్పందిస్తూ, ప్రతి ఒక్కరు సమిష్టిగా కలిసి కాలనీ అభివృద్ధికి పాటుపడాలని ఒక ఆదర్శవంతమైన కాలనీ గా తీర్చిదిద్దే క్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. కాలనీ లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని మౌలిక వసతుల కల్పనకై పెద్ద పీట వేస్తానని, అయ్యప్ప సొసైటీ కాలనీ ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు వాసు మరియు శ్రీ స్వామి అయ్యప్ప కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ మేనేజింగ్ కమిటీ ప్రెసిడెంట్ కంచర్ల.మాధుసూధన్ రెడ్డి, సెక్రటరీ కూచిపూడి వెంకటేశ్వరరావు కెవి రావు, ట్రెజరర్ ఎం వి వి కె ప్రసాద్ చిన్న ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ దామ వెంకటరత్నం. డి వి రత్నం, కమిటీ మెంబర్లు బాలకిషన్ భూక్య, భవాని పోరెడ్డి, పద్మజ చెట్పల్లి మరియు కాలనీ వాసులు గోపాల్ రెడ్డి, రాంనారాయన్, భూపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, మహేష్, సోమిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.