ఆర్థిక సాయం అందజేత
Published: Wednesday February 24, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన నల్లమాస కిష్టయ్య ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుంచి పడి మృతి చెందడంతో మంగళవారం వారి కుటుంబ సభ్యులను భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు డా బూర నర్సయ్య గౌడ్ పరమార్శించి 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు డేగల పాండు యాదవ్, మండల రైతు కో-ఆర్డినేటర్ మమతా నరేందర్ రెడ్డి, ఎంపిటిసి నోముల మల్లేష్ యాదవ్, నరేష్, జువ్వగాని సుమన్ గౌడ్, శ్రీను, ధనుంజయ్, అశ్విన్, సత్యనారాయణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: