ఆర్యవైశ్య యువతీ యువకులకు ఉచిత వివాహ పరిచయ వేదిక

Published: Thursday March 18, 2021

మంచిర్యాల టౌన్, మార్చి17, ప్రజాపాలన: తెలంగాణలో మొట్టమొదటిసారిగా మంచిర్యాల వాసవి వికాస పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక ఉచిత వివాహ పరిచయ వేదిక ను వధూవరులు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల వాసవి వికాస పరిషత్ నిర్వాహకులు గుండ సుధాకర్ కోరారు బుధవారం మంచిర్యాల విశ్వనాధ ఆలయంలోని ధ్యాన మందిరములో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ మంచిర్యాల మండలంలోని వేంపల్లి పద్మావతి గార్డెన్స్ లో ఈ నెల 21వ తేదీ ఆదివారం రోజున ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈ ప్రత్యేక ఉచిత వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ పరిచయ వేదిక వ్యాపారం నిర్వహించుకునే యువకుల కోసం నూతన ఆలోచనలతో వ్యాపార దృక్పధాన్ని, ఔన్నత్యాన్ని పరిరక్షించాలని లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివాహ వయసు కలిగిన ఆర్యవైశ్య యువతీ యువకులు ఈ పరిచయ వేదికలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని నచ్చిన వారిని వివాహం కోసం ఎంచుకునే అవకాశం ఉందని అన్నారు. ఆసక్తి కలిగిన అమ్మాయిలు అబ్బాయిలు పరిచయ వేదిక తమ ఫోటో పూర్తి బయోడేటా తమకు పంపి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ వివాహ పరిచయ వేదిక లో మంచిర్యాల నుండే కాకుండా వివిధ జిల్లాల నుండి పెళ్లీడుకొచ్చిన వైశ్య యువతీ యువకులు హాజరు కావాలని కోరారు. ఈ సమావేశంలో లో మంచిర్యాల వాసవి వికాస్ పరిషత్ సభ్యులు పుత్తూరు తిరుపతి, మల్యాల శ్రీనివాస్, తోట చంద్రమౌళి, తోట ప్రవీణ్ కుమార్, కాచం సతీష్, కేశెట్టి వంశీకృష్ణ పాల్గొన్నారు.