జడ్పీ చైర్ పర్సన్ వసంత, ఎమ్మెల్యే సంజయ్ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో

Published: Tuesday April 05, 2022

జగిత్యాల, ఏప్రిల్ 04 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని తహశీల్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన తెరాస నాయకులు ధర్నా రాస్తారోకోలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా తెలంగాణలో రైతాంగం పండించిన వేసంగి వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ జగిత్యాల జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ ఎమ్మెల్యే డా: సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ అర్బన్ రూరల్ మండలంలోని తెరాస నాయకులు కార్యకర్తలు రైతులతో కలిసి తహసీల్ చౌరస్తా ఆర్డీవో కార్యాలయం ముందు తెరాస నిరసన దీక్ష ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ జడ్పీటీసీ సంగెపు మహేష్ ఎంపీపీ రాజు ప్యాక్స్ చైర్మన్ మహిపాల్ రెడ్డి దామోదర్ రావు వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.