మహేంద్ర సంఘం వృత్తి దారుల సమస్యల పరిష్కారానికి కృషి . .... ఎమ్మెల్యే రేఖానాయక్

Published: Tuesday September 20, 2022
జన్నారం, సెప్టెంబర్ 18, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల మహేంద్ర సంఘం వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రేఖానాయక్   అన్నారు.ఆదివారం  ప్రపంచ వెదురు దినోత్సవం పురస్కరించుకొని మండలంలోని మహేంద్ర సంఘం సభ్యులు  భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక బస్టాండులో మహేంద్ర జెండా ఆవిష్కరించారు . ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై  మహేంద్రులకు వెదురు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.  మండల మహేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం నరసింగరావు మహేంద్ర సమస్యలను వివరించగా దానిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అర్హులైన వారికి డబుల్ బెడ్ రూములు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. బిసి సంక్షేమంలో ఏవైనా లోన్లు వచ్చిన ముందుగా అర్హులైన మేదరులకు వచ్చేలా చూడాలని స్థానిక ఎంపీడీవో అరుణానికి తెలిపారు. అలాగే మహేంద్రల జీవనోపాధి కులవృత్తిని ముందుకు తీసుకెళ్లేలా వెదురు ఉత్పత్తులకు ఆటంకం కలగకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మహేంద్ర పెద్దలు, యువజన సంఘం నాయకులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area