మల్లన్నపేట దొంగ మల్లన్నకు నిలువెత్తు బంగారం సమర్పించిన ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

Published: Thursday December 15, 2022

జగిత్యాల, డిసెంబర్ 14 (ప్రజాపాలన ప్రతినిధి): పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి మల్లికార్జున స్వామి కి నిలువెత్తు బంగారం సమర్పించారు. గొల్లపల్లి మండలం మల్లన్న పేటలోని  దొంగ మల్లన్న ఆలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు జీవన్ రెడ్డికి తీర్థ ప్రసాదాలు , ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిలువెత్తు బంగారం సమర్పించి, భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి , జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్లూరు లక్ష్మణ్ కుమార్, పిసిసి సభ్యులు గిరి నాగభూషణం తదితరులను శాలువాలతో సన్మానించారు.