సాయినాథ మందిరంలో ఆర్టీసీ డిఎం ప్రత్యేక పూజలు
Published: Friday July 29, 2022
ఇబ్రహీంపట్నం జూలై తేదీ 28 ప్రజాపాలన ప్రతినిధి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్ గ్రామ పరిధిలోగల సత్యనారాయణ స్వామి గుట్టపై వెలసిన ఏకశిలా సాయినాథ మందిరంలో ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ అశోక్ రాజు తమ సిబ్బందితో హాజరై సాయినాధునికి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాధుని దివ్యదర్శనానికి వచ్చిన డిపో మేనేజర్ కు ఆలయ చైర్మన్ మడుపు వేణుగోపాల్ రావు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అన్నదానం చేసిన కలకొండ ధనలక్ష్మి చంద్రశేఖర్, ధరణిధర్, సాయిరాం, ఆర్టీసీ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
Share this on your social network: