మడుపల్లి లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Published: Thursday June 03, 2021
మధిర, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కోవిడ్ నిభందనలు పాటిస్తూ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ. 60 ఏళ్ల ఈ ప్రాంత ప్రజల కల, కెసిఆర్ గారు తెరాస పార్టీ త్యాగం, ఎందరో విద్యార్థుల, యువత బలిదానాలు, ఎందరో పోరాట యోధుల త్యాగాలు, తెలంగాణ బానిస సంకెళ్లు తెంచి, స్వేచ్ఛా స్వాతంత్ర్యం సాధించిన రోజు. కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ మెడలు వంచి తెలంగాణ సాధించిన రోజు అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తొగరు ఓంకార్, 6వ వార్డు అధ్యక్షులు పారుపల్లి, కార్యదర్శి సరవయ్య, తెరాస నాయకులు పిల్లి దావీదు, నండ్రు బాబు, తొగరు కృష్ణా రావు, మేడికొండ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: