మానవత్వాన్ని మరిచిన మానవ మృగం

Published: Tuesday March 29, 2022
వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన : మానవత్వాన్ని మరిచి మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని చన్ గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగడి చిట్టెంపల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి జిల్లా ఎస్పి నంద్యాల కోటిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చన్ గోముల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని అంగడి చిట్టంపల్లి గ్రామంలో మైనర్ బాలిక మర్డర్ & రేప్ జరిగిన సంఘటన స్థలాన్ని ఈ రోజు జిల్లా ఎస్పి కోటి రెడ్డి సందర్శించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడటం జరిగింది. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇట్టి ఘటన పైన కేసు నమోదు చేసి నేరస్థులపైనా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తూనమని వివరించారు. బాధిత కుటుంబ సభ్యులకు పోలీస్ అధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉండి నేరస్థులకు కోర్ట్ ద్వారా శిక్ష పడే విధంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. ఘటనలోని నేరస్థులు తప్పించుకోకుండా అన్నీ కోణాలలో దర్యాప్తు కొనసాగించి అన్నీ రకాల సాక్ష్యాధారాలను సేకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. క్రైమ్ సీస్ లో డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ టీమ్ సభ్యుల ద్వారా టెక్నికల్ సంబంధిత ఆధారాలు కూడా సేకరించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపినారు.