ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ, రావత్ కు ఘన నివాళి

Published: Saturday December 11, 2021
బెల్లంపల్లి డిసెంబర్ 10 ప్రజాపాలన ప్రతినిధి : తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అసువులు బాసిన భారత త్రివిధ దళాల అదిపతి బిపిన్ రావత్ తో పాటు పలువురు సైనికులు సందర్భంగా గురువారం రాత్రి బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాంటా చౌరస్తా వద్ద కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు సజ్ను షఫీ, అధ్యక్షులు కృష్ణ,ప్రధాన కార్యదర్శి వెంకటేష్ లు మాట్లాడుతు ప్రమాదంలో సైనిక అధికారి తో పాటు సైనికులు చనిపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. భారత దేశ సైనిక బలాన్ని ప్రపంచ నలుమూలలకు చాటిచెప్పిన ఘనత ఆయనదని అన్నారు. భారత రక్షణ దళాలను దేశ రక్షణలో చాక చక్యంగా వ్యవహరించే వ్యూహ రచనలు రూపొందించడంలో దిట్ట అయిన రావత్ మరణం దేశానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.