శ్రీ సాయి గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో అన్నదానం

Published: Friday September 09, 2022

బోనకల్, సెప్టెంబర్ 8 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్ నందు శ్రీ సాయి గణేష్ యూత్ వారి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోనకల్ సర్పంచ్ భూక్య సైదానాయక్ విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యశ్వంత్,వంశీ, మోహన్,కార్తీక్, సుభాని,బడే మియా,దిలీప్ ,షారుక్ ఖాన్,సైదులు, శివకృష్ణ ,హరికృష్ణ,లక్షణ దుర్గారావు,మహిళా భక్తులు విజయ, లీలావతి,దుర్గ,త్రివేణి ,రమ్య,నాగమణి, నాగమ్మ, కృష్ణవేణి,కళావతి,రమ్య,గ్రామ మహిళలు తదురితరులు పాల్గొన్నారు.