నాణ్యత గల ప్రమాణాలు వాడాలి.... కాంట్రాక్టర్లు
Published: Friday February 05, 2021
బాలాపూర్ : ప్రజాపాలన న్యూస్;
మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధి లోని 9వ డివిజన్ కార్పొరేటర్ పెండ్యాల శివ పార్వతి నరసింహ్మ ఆధ్వర్యంలో నందిహిల్స్ ప్రధాన రహదారిలో 5 నెలల క్రింద గుంతలు ఉన్న దగ్గర పాట్చ్ వర్క్ జరిగింది.కానీ ఆ రోడ్ ఇప్పుడు కూడా గుంత లు పడి,రాళ్లు తేలి అస్తవ్యస్తం గా మారిందినీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంమని కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు కు వినతి పత్రాన్ని సమర్పించారు. స్థానిక కార్పొరేటర్ వెంటనే రోడ్ మరమ్మత్తు లు చెయంచాలని మున్సిపల్ కమీషనరునీ కోరారు. కాలనీ వాసులు అందరూ ఏన్ని సార్లు ఈ విషయంలో కాంట్రాక్టర్లను నిలదీశారు. నాణ్యత ప్రమాణాలు వాడినట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుందని అంటున్నారు. కమిషనర్ స్పందించి వెంబడే మరమ్మతులు చేపడతారని చెప్పారు.
Share this on your social network: