సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Thursday June 17, 2021
పరిగి, 16 జూన్ ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గంలోని స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి  తన నివాసంలో దోమ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 7 మంది ఇటీవలే అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూపాయలు 6.49 లక్షల రూపాయలు మంజూరు చెహించి బుధవారం లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మహేష్ రెడ్డి జెడ్పిటిసి నాగిరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ ఖాజాపాష. ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్, జిల్లా శాఖ డైరెక్టర్ యాదయ్య గౌడ్ తెరాస పార్టీ అధ్యక్షులు రాఘవేందర్ రేడ్డి బొంపల్లి ఉప సర్పంచ్ రపీక్ పాషా.మరియు లబ్దిదారులు పాల్గొన్నారు.