మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం

Published: Thursday June 03, 2021
మధిర, జూన్ 02, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో జరిగినవికాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరంసెట్టి కిషోర్ జండా ఆవిష్కరించారు. సూరంసెట్టి కిషోర్ మాట్లాడుతూ. 60 ఏళ్ల ఈ ప్రాంత ప్రజల కల, ఎందరో విద్యార్థుల, యువత బలిదానాలు, ఎందరో పోరాట యోధుల త్యాగాలు, తెలంగాణ బానిస సంకెళ్లు తెంచి, స్వేచ్ఛా స్వాతంత్ర్యం ప్రసాధించిన రోజు కాంగ్రెస్ పార్టీ చొరవతో సోనియాగాంధీ గారు ప్రత్యేక శ్రద్ద తీసుకొని తెలంగాణ రాష్ట్రం ఎర్పాటు చేసినారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చవా వేణు, మధిర మున్సిపల్ కౌన్సిలర్లు కోన ధనికుమార్, మునుగోటి వెంకటేశ్వర్లు, మధిర మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి, మధిర మండల ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు కోరం పల్లి చంటి, మధిర పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, కాంగ్రెస్ నాయకులు విజయ్ బాబు, ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అలీ, సూర్యదేవర కోటేశ్వర రావు మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు.. మొదలగువారు పాల్గోన్నారు...