కరీంపేట గ్రామం లో ఘనంగా పౌరహక్కుల దినోత్సవం శంకరపట్నం నవంబరు 30 ప్రజాపాలన రిపోర్టర్
Published: Thursday December 01, 2022
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామములో ఈ రోజు పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల చివరి రోజున ఒక్కో గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, సమాజంలోని అంటరానితనం అస్పృశ్యత నిర్మూలించడానికి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందని ఆయన అన్నారు. గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఎవైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు.అనంతరం సహపంక్తి బోజనంలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అద్యక్షుడు గొట్టె అర్జున్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల ఇంచార్జి మెరుగు శ్రీనివాస్, నాయకులు, గ్రామస్థులు తధితరులు పాల్గొన్నారు.
Share this on your social network: