ఇంజనీర్ డే అవార్డు అందుకున్న ఎస్ జి ఎస్ మూర్తి కి సన్మానం

Published: Wednesday September 22, 2021
బాలాపూర్, సెప్టెంబర్ 21, ప్రజాపాలన ప్రతినిధి : అవార్డు రావడం సంతోషంగా ఉందని ఎం. వి. ఎస్. ఆర్ సివిల్ ఇంజనీర్ కాలేజీ  వైస్ ప్రిన్సిపాల్ ఎస్. జి. ఎస్. మూర్తి అన్నారు. ఇంజనీర్ డే సందర్బంగా మహేశ్వరం నియోజకవర్గంలోని గొప్ప ఇంజనీరింగ్ కాలేజ్ అధ్యాపకునికి సోమాజిగూడ లో ఏర్పాటుచేసిన ఏ. సి. సి. ఎ ఆధ్వర్యంలో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సివిల్ అధ్యాపకులు వైస్ ప్రిన్సిపల్ ఎస్ జి ఎస్ మూర్తిని నియోజకవర్గ తెరాస పలువురు నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. తెరాస నాయకులు మాట్లాడుతూ.... ప్రముఖ ఇంజనీర్ అవార్డు వచ్చిన సందర్బంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కంగ్రాట్యులేషన్స్ తెలిపారు. ఎంతో మందిని గొప్ప సంకల్పంతో ఇంజనీర్లగా తీర్చిదిద్దుతున్న మన అధ్యాపకునికి మును ముందు ఎన్నో అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వంటేరు నరసింహారెడ్డి, మామిడి సుదర్శన్ రెడ్డి, ఎర్ర ఆంజనేయులు, వెంకటేశ్, తదితరులు సన్మానించారు.