బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే...

Published: Thursday September 23, 2021
సారంగాపూర్, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : సారాంగాపూర్ మండల్ రేచపల్లి గ్రామ సర్పంచ్ ఎడమల జయ భర్త తెరాస నాయకుడు ఎడమల లక్ష్మారెడ్డి అనారోగ్యంతో భాదపడుతుండగా ఎమ్మెల్యే డా:సంజయ్ కుమార్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే పోతారం గ్రామానికి చెందిన ఇడగొట్టు భూమయ్య అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ ఢిల్లీ రామారావు జడ్పీటీసీ మనోహర్ రెడ్డి గుర్రాల రాజేందర్ రెడ్డి సోల్లు సురేందర్ తదితరులు ఉన్నారు.