ఓటమి భయంతోనే ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర. టిఆర్ఎస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం.

Published: Friday October 28, 2022
ప్రజా పాలన , అక్టోబర్ 27, శ్రీరాంపూర్ :
 
మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు కుట్ర చేస్తున్నారని నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఇసంపల్లి ప్రభాకర్ ఆరోపించారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని సిసిసి కార్నర్ వద్ద బిజెపి దిష్టిబొమ్మను దానం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను కొనుగోలు కుట్ర చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతి నెలకొల్పేందుకే బిజెపి పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కే. సురేందర్ రెడ్డి, టిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల రవీందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి. కమలాకర్ రావు, కౌన్సిలర్లు వంగ తిరుపతి భేర సత్యనారాయణ, మొగిలి, పంబాల గంగా ఎర్రన్న, టిఆర్ఎస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు సంతోష్ చారి ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్ మాజీ సర్పంచులు గుంట జగ్గయ్య వేల్పుల రాజేష్ టిఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.