వార్డులు అభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి

Published: Saturday July 03, 2021
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలో మడుపల్లి గ్రామంలో ఐదవ వార్డ్ లో రెండో రోజు కొనసాగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమం మధిర జూలై 2/7/2021 ప్రజాపాలన ప్రతినిధి మధిరవార్డుల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టారని మధిర మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శీలం విద్యా లత గారు పేర్కొన్నారు. శుక్రవారం వార్డుల్లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తొలిరోజు వీధుల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐదవ వార్డు ఇంచార్జి కిరణ్ కంభం విజయ్ కుమార్ ఆశా వర్కర్లు, ఆర్పి అంగన్వాడీ టీచర్లు మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.