బైక్ పై నుంచి పడిపోవడంతో

Published: Tuesday May 18, 2021
మధిర, మే 17, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడిపల్లి గ్రామం వద్ద బైక్ మీద నుంచి కింద పడి ఒక వ్యక్తికి కుడికాలు విరగడం జరిగింది అతను కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం గుమ్మడిదుర్రు గ్రామానికి చెందిన కోట సత్యనారాయణ వయస్సు 50 సంవత్సరాలు ఇతను తన స్వగ్రామం నుండి బైక్ పైన మడుపల్లి లోని చెక్ డ్యాము నిర్మాణం పనుల నిమిత్తం అతను బైక్ పై వస్తుండగా బైక్ పై నుంచి  రోడ్డు మలుపు వద్ద కింద పడిపోవడంతో అతని కుడి కాలు కింద భాగంలో విరిగిపోవడం జరిగింది. రక్తస్రావం లో పడి ఉన్న వ్యక్తి కోసం స్థానికులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇవ్వడంతో మధిర నుండి 108 అంబులెన్సు సంఘటనా స్థలానికి చేరుకొని తనకి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ గజ్జలకొండ శివ నాగేశ్వరరావు పైలట్ రాజు ప్రధమ చికిత్స అనిపిస్తూ అతనినీ  మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.