ఓపెన్ టు ఆల్ క్రికెట్ టోర్నమెంటులో మర్పల్లి జట్టు విజేత

Published: Friday March 10, 2023
* ఎస్కెఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు సనగారి కొండల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 09 మార్చి ప్రజాపాలన :  సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 17 న ఎస్ కే ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ టూ ఆల్ క్రికెట్ టోర్నమెంట్ లో 70 టీంలు పాల్గొన్నాయని టోర్నీ నిర్వాహకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్పల్లి టీం విన్నర్ గా, రన్నర్ గా కల్ఖోడ టీం నిలిచాయని స్పష్టం చేశారు. టోర్నీ నిర్వాహకులు, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి విన్నర్ టీం కు రూ.1లక్షా ట్రోపి, రన్నర్ టీంకు రూ.50 వేలు ట్రోపి, అలాగే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ రూ.10 వేలు అందజేశారు. గెలుపోటములు సహజమని, క్రీడలతో స్నేహభావం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామేశ్వర్, సొసైటీ వైస్ ఛైర్మన్ పసియుద్దీన్, సర్పంచ్ ధరమ్ సింగ్, ఎంపీటీసీ రవీందర్, సీనియర్ నాయకులు బంటు రమేష్, రతన్, రవీందర్ రెడ్డి, రవీందర్, నవీన్, నర్సింహారెడ్డి ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.