అభివృద్ధి పనుల కోరకు మండల ఎంఇఓ అవగాహన

Published: Wednesday May 18, 2022

జన్నారం రూరల్, మే 17, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలం నుండి ఇరువై రెండు పాఠశాలలు సెలెక్ట్ కావడం జరిగిందని మండల ఎంఇఓ విజయ్ కుమార్  అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మండలంలో ఇరువై రెండు పాఠశాలలు అభివృద్ధి పనుల కొరకు సెలెక్ట్ కాగా, వాటిలో నుండి పది పాఠశాలలకు ప్రభుత్వ అనుమతి వచ్చిందని, అ పది గ్రామాలలో పాఠశాలలో బుదవారం చేపట్టవలసిన పనులపై ప్రధానోపాధ్యా యులు, చైర్మన్ గ్రామ సర్పంచ్ లకు అవగాహన సమావేశం నిర్వహించడం జరిగిందని అయన అన్నారు.