ఘనంగా చేగువీర 54వ వర్ధంతి

Published: Monday October 11, 2021
బోనకల్, అక్టోబర్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని రావినూతల డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా చేగువీర 54వ వర్ధంతిని రావి నూతల డివైఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంచర్ల గోపి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు గుగులోతు. పంతులు, గండు సైదులు మాట్లాడుతూ యువత చేగువీర ను ఆదర్శంగా తీసుకొని సమసమాజ స్థాపనకు కృషి చేయాలని అందరికీ ఆదర్శంగా ఉండాలని సోషలిజం లక్ష్యంగా పనిచేయాలని నేటి యువత రేపటి భారతావని అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలని రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ ఇన్ చార్జ్ ఎర్రగాని.నాగరాజు, డివైఎఫ్ఐ మండల అధ్యక్షులు బానోతు గోపి, డివైఎఫ్ఐ మాజీ నాయకులు గుగులోతు నరేష్, ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గుగులోతు. శారద, యూత్ నాయకులు బోయిన బోయిన గురవయ్య, కొమ్మినేని పిచ్చయ్య, మరీదు వెంకటేష్, నాగేంద్రబాబు, పవన్ కుమార్ కందిమల్ల.అచ్యుతరావు భానోత్ నాగేశ్వరరావు బానోతు మాన్య నాయక్, బానోత్ స్వామి, గుగులోతు.సైదులు ధరావత్ నరేష్, ధరావత్ జగన్, బానోతు వీరమ్మ గుగులోతు లక్ష్మి, బానోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.