మా భూమి కబ్జా చేశారు

Published: Tuesday September 21, 2021
వారి పై చర్యలు తీసుకోని భూమి కి రక్షణ కల్పించాలి.  
మీడియా ముందు గోడు వెళ్ళబోసుకున్న బాధితులు. 
బెల్లంపల్లి, సెప్టెంబర్ 20, ప్రజాపాలన : బెల్లంపల్లి పట్టణంలో  కన్నలలో ని సర్వే నంబర్ 112లో గల గాండ్ల లక్ష్మి కి చెందిన 4 ఎకరాల లావాణి పట్టా భూమిని కొందరు కబ్జా చేస్తూ భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి పై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ బాధితులు సోమవారం మీడియా ముందుకు వచ్చారు. బాధిత లక్ష్మీ కుటుంబ సభ్యులు గాండ్ల రమేష్, మహేష్ లు మాట్లాడుతూ సర్వే నెంబర్ 112లో 4 ఎకరాల భూమిని 1980 సం. నుండి సాగు చేసుకొంటూ, జీవుస్తున్నామని పేర్కొన్నారు, ఇటీవల పట్టణంలోని గాంధీనగర్ చెందన ముగ్గురు తమ భూమి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. లావాణి పట్టా భూమిని అమ్మడం, కోనడం నెరమైనప్పటికి, తప్పుడు పాత్రలు సృష్టించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జా దారుల నుంచి తమకు, భూమికి రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు స్పందించాలని కోరారు. భూమికి సంబంధించి పూర్తి పత్రాలు, హక్కులు తమకు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని వేడుకున్నారు.