పార్స్ ఏ.పీ గుంటూరు ఈస్ట్మున్సిపాలిటీ 53,55 వార్డ్ ప్రెసిడెంట్స్ గా నియామకం

Published: Wednesday July 27, 2022

పార్స్ ఏ.పీ గుంటూరు ఈస్ట్ మున్సిపాలిటీ 53, 55 వార్డ్ ప్రెసిడెంట్స్ గా నియామకం

జులై 26  ప్రజాపాలన ప్రతినిధి : పూలే అంబేడ్కర్ రాజ్యాధికారి సమితి PARS ఏ.పీ గుంటూరు ఈస్ట్ మున్సిపాలిటీ  కు Sk ఖాదర్ బీ - 53 వార్డ్  ప్రెసిడెంట్ గా,  చీరాల  రజిని - 55th వార్డ్  సెక్రటరీ గా, గొట్టిముక్కల  లూర్దు  మేరీ- 55th వార్డ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఈ మేరకు PARS ఆంధ్ర ప్రదేశ్ గుంటూరు  ఈస్ట్  అసెంబ్లీ  అధ్యక్షులు   షేక్ కామార్జహా గుంటూరు ఈస్ట్ మున్సిపాలిటీ కు Sk ఖాదర్ బీ , చీరాల  రజిని, గొట్టిముక్కల  లూర్దు  మేరీ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  వీరు గుంటూరు  పరిధిలొ రాజకీయ అవగాహన ఉన్న ముఖ్య నాయకులతో కమిటీలను నియమించడంతో పాటు బహుజన వాదాన్ని బలపరిచే వివిధ రంగాలలో పని చేస్తున్న వారిని పార్స్ అనుబంధ సంఘాలుగా వీరి పరిధిలొ నియమించి, రెండు విభాగాల మధ్య సమన్వయ పరిచి వారందరి సహకారంతో బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని ఈ సంధర్బంగా ఆయన పేర్కొన్నారు.  వీరి నియామకం పట్ల పలువురు బహుజనులు అభినందిస్తూ హర్షం వ్యక్తం చేసారు.