ప్రాథమిక పాఠశాల నడిపితే చర్యలు : ఎంఈ.వో బత్తుల భూమయ్య
Published: Friday March 19, 2021
వెల్గటూర్, మార్చి 18 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం లోని ప్రాథమిక పాఠశాలలు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు నడిపితే చర్యలు తప్పవని అని మండల విద్యాధికారి బత్తుల భూమయ్య హెచ్చరించారు. మండలంలోని వివిధ ప్రైవేటు పాఠశాలల ను గురువారం ఎం. ఈ.వో ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిద్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలు వచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రాథమిక తరగతులు నడప వద్దని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా ప్రాథమిక పాఠశాలలు నడిపినట్లు దృష్టికి వస్తే డి.ఈ.ఓ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Share this on your social network: