శ్రీ షిరిడి సాయి మందిర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిన గణేశుని శోభాయాత్ర

Published: Tuesday September 06, 2022

బోనకల్, సెప్టెంబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రమైన బోనకల్ లోని శ్రీ షిరిడీ సాయి మందిర ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గణేశ్‌ శోభాయాత్రను సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. నవరాత్రులు పూజలందుకున్న గణేశ్‌ మండపం వద్ద వినాయకుడి కి ఆలయ అర్చకులు ఫణీకుమార్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతికి హారతినిచ్చి భక్తులకు ప్రసాదం అందజేశారు. అనంతరం చతుర్థిని పురస్కరించుకుని శోభాయాత్రను మంగళ వాయిద్యాలతో, దైవ గీతాలతో మహిళా భక్తుల కోలాటాలతో ఎడ్ల జతలు రథాన్ని లాగాయి. రథయాత్ర సాయి నగర్ నుంచి ప్రారంభం కాగా ఖమ్మం సెంటర్, పంచాయతీ కార్యాలయ సెంటర్, సొసైటీ సెంటర్, హైస్కూల్ సెంటర్ కు చేరుకుని అక్కడ నుంచి స్థానిక చెరువులో నిమజ్జనం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణేశుని శోభాయాత్రను ముగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు మన్నేపల్లి మోహన్ రావు, సభ్యులు చింతనిప్పు వెంకటేశ్వర్లు, యలగందుల కృష్ణ, ఆలయ అర్చకులు ఫణి కుమార్ శర్మ, నిమ్మల రాజశేఖర్, కలవల నారాయణ, కలవల సుబ్బారావు, మహిళా భక్తులు వేమా లలిత, కస్తూరి, కాటేపల్లి వాణీ, యేల్లారేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.