సామాజిక రుగ్మతలను ఎదిరించిన సావిత్రిబాయి పూలే

Published: Saturday March 11, 2023
 డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్
తల్లాడ(కారేపల్లి), మార్చి 10 (ప్రజా పాలన న్యూస్): 
 సమాజంలోని దురాచారాలను, అస్పృశ్యతను, మహిళలపై నిర్బంధ కట్టుబాట్లను ఎదిరించి   దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు గా స్త్రీలను చైతన్యపరిచిన వీరవనిత సావిత్రిబాయి పూలే అని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ తెలిపారు. శుక్రవారం పండితాపురం గ్రామంలో సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మళ్లీ బాబు యాదవ్ తో పాటు బిసి సంఘాల నాయకులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే గొప్ప సామాజిక మార్గదర్శకురాలన్నారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు భూక్యా నాగేంద్రబాబు నాయక్, మండల అధ్యక్షులు పాటిబండ్ల ప్రసాద్ మాదిగ, బిసి సంఘం నాయకులు రాయల  బిక్షమయ్య  గుగులోత్ రాంజీ పాల్గొన్నారు.