కవి, రచయిత, రాధా కృష్ణ చారి కి జాతీయ పురస్కారం .
Published: Tuesday September 20, 2022
ఆసిఫాబాద్ జిల్లా , సెప్టెంబర్ 18 , ప్రజాపాలన, ప్రతినిధి :
జిల్లా కేంద్రానికి చెందిన కవి, రచయిత, జర్నలిస్ట్, చిలుకూరి రాధాకృష్ణ చారి కి విశ్వకర్మ సేవా ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విశ్వకర్మ జాతీయ పురస్కారాలు 2022 సం కు సాహితీ సేవా రంగంలో విశిష్ట కృషి చేసినందుకు విశ్వకర్మ మహితి సేవరత్న పురస్కారం, అందుకున్నట్లు రాధాకృష్ణ చారి తెలిపారు. ఈ పురస్కారాన్ని రాష్ట్ర విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు కౌలే జగన్నాథం, విశ్వకర్మ తేజస్విని మాసపత్రిక ఎడిటర్ పెందోటి సోములు శాలువ, జ్ఞాపిక, ప్రసంశ పత్రంతో ఘనంగా సత్కరించారు. పురస్కారం అందుకున్న రాధాకృష్ణ చారి ని విశ్వబ్రాహ్మణ (విశ్వకర్మ) ఐక్య సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు తూమోజు సురేష్ చారి, రాష్ట్ర నాయకుడు వేణుగోపాల చారి, అధ్యక్ష కార్యదర్శులు భాస్కరాచారి, అశోక్ చారి, శ్రీరామోజు వెంకటయ్య, సింహాద్రి,జి వెంకటేష్,పలువురు అభినందించారు.
Share this on your social network: