యనమదుల జోషి కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ పొంగులేటి

Published: Monday October 10, 2022

బోనకల్, అక్టోబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు యనమదల జోషి(72) ఇటీవల   అనారోగ్య కారణాల వల్ల మృతి చెందగా,మృతుడి కుటుంబాన్ని ఆదివారం రోజున ఖమ్మం మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సందర్శించి యనమదుల జోషి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జోషి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి ఆ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి మృతి ఆ కుటుంబానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుగులోతు పంతు, రావినూతల ఎంపీటీసీ కందిమల్ల రాధ,  మాజీ ఉపసర్పంచ్ గండు సైదులు, సిపిఎం పార్టీ ఖమ్మం 1 టౌన్ సెక్రెటరీ ఎస్.కె జబ్బార్ , సిపిఎం ఖమ్మం కార్యదర్శి వర్గ సభ్యులు అంబరపుడి సుధాకర్, యుటిఎఫ్ బోనకల్ మండల కార్యదర్శి గుగులోతు రామకృష్ణ, ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు గుగులోత్ శారద, నవతెలంగాణ జాబు వర్కర్ భూక్యా కృష్ణ,మాజీ ఎంపీటీసీ తాళ్లూరి బాబు, ఒకటో వార్డు మెంబర్ లావూరి వెంకటేశ్వర్లు, సిపిఎం సీనియర్ నాయకులు కొంగర భూషయ్య, కొమ్మినేని పిచ్చయ్య, ఎరగాని నాగరాజు, ఎరగాని నాగేశ్వరరావు, దొండపాటి సత్యనారాయణ, మరీదు పుల్లయ్య,గుగులోతు నరేష్, బానోతు గోపి, బానోతు నాగేశ్వరరావు,పి అఫ్జల్ మియా, ఎస్.కె నాగుల్ మీరా, ఎస్.కె నన్నేసాహెబ్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు బొమ్మెర రామ్మూర్తి, కోటా రాంబాబు,  రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, రావినూతల ఉపసర్పంచ్ బోయినపల్లి కొండలు, ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సైదా, రావినూతల రైతు కన్వీనర్ షేక్ జాని  టిఆర్ఎస్ నాయకులు సాదినేని రాంబాబు, ఉమ్మినేని కృష్ణ, రజక సేవా సంఘం జిల్లా అధ్యక్షులు తమ్మారపు బ్రహ్మయ్య, టిఆర్ఎస్ రావినూతల గ్రామ శాఖ కార్యదర్శి బంధం తిరుపతిరావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు మూడవత్ సైదా, తాళ్లూరి ప్రేమానందం, తుడుం మంగయ్య, టిఆర్ఎస్ మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.