బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రమేష్ రాథోడ్
Published: Thursday March 02, 2023
జన్నారం, మార్చి 01, ప్రజాపాలన: మండలంలోని చింతలపల్లి గ్రామానికి చెందిన దాసరి తరుణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించింన సంగతి తెలుసుకున్న మాజీ ఎంపి బీజేపీ నేత రాథోడ్ రమేష్ నాయకులతో కలిసి బుధవారం కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదేవిధంగా చింతగుడా గ్రామానికి చెందిన భావ్ సింగ్, వీఆర్ఏ ప్రేమ్ సాగర్, అలాగే మెడికో విద్యార్థి దాసరి హర్ష ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం రాష్ట్రాన్ని కుదిపేసిందని, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. ప్రగాఢ సానుభూతి వ్యక్తి పరిచారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం నుండి సహకారం అందించాలన్నారు. ఆయన వెంట జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య, ఎంపీటీసీ మధుసూధన్ రావు, ఎస్టీ మోర్ఛా జిల్లా అధ్యక్షులు అజ్మీరా బద్రి నాయక్, శక్తి కేంద్ర ఇంఛార్జి బూరగడ్డ జగన్, ఐటీ సెల్ కన్వీనర్ గూడ గంగాధర్, ప్రధాన కార్యదర్శులు పంజాల సురేష్, బూరగడ్డ నరేష్, కార్యదర్శులు, యాదగిరి వెంకటేష్, పోతు సతీష్, వెలగొండ శ్రీనివాస్, బీజేపీ నాయకులు పోతు రాజమౌళి, బీనవేని రవి, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: