ఆకర్షణీయమైన హంగులతో ఎస్సార్ ఫంక్షన్ హాల్ నూతన ప్రారంభోత్సవం

Published: Monday December 05, 2022
 బోనకల్, డిసెంబర్ 4 ప్రజా పాలన ప్రతినిధి :మండల కేంద్రంలో  ఆదివారం రోజున ఖమ్మం రోడ్డు లో నూతనంగా నిర్మించిబడిన ఎస్సార్ ఫంక్షన్ హాల్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మంత్రి, జడ్పీ చైర్మన్, సీఎల్పీ నేత, పొంగులేటి లకు నిర్వాహకులు శీతల రామ సంఘం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని వర్గాల వారికి,అందరికీ అందుబాటులో మంచి ఆకర్షణీయమైన హంగులతో అన్ని రకాల సౌకర్యాలతో మండల కేంద్రానికి అత్యంత సమీపంలో, ఖమ్మం రోడ్డు లో సాయిబాబా టెంపుల్  దగ్గరలో ఏర్పాటు చేసినందుకు  ఇంతటి ఆహ్లాదకరమైన ఫంక్షన్ హాల్ను నిర్మించిన నిర్వాహకులు శీతల రామ సంఘం కు వారు  అభినందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జున రావు, టిఆర్ఎస్ మాజీ అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, మండల కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, బొమ్మెర రామ్మూర్తి, బోనకల్ గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్, రావినూతల గ్రామ సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్, మండల రైతు కన్వీనర్ వేమూరి ప్రసాద్, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, టిఆర్ఎస్ నాయకులు బండి వెంకటేశ్వర్లు, కోయినేని ప్రదీప్, బాగం నాగేశ్వరరావు, ఉమ్మినేని కృష్ణ,రేగళ్ల వీరయ్య, మండల టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,అభిమానులు,గ్రామస్తులు,పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.